ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడ్రోజుల పాటు కూడా ఈ వానలు కొనసాగే అవకాశముంది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెదర్ బులిటెన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షసూచన జారీ చేయగా.. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్వల్ప వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక 31న అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని హెచ్చరించగా.. గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో స్వల్ప వర్షాలు పడతాయని అంచనా వేశారు.
ఇక 1వ తేదీన విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. నిన్న నంద్యాలలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. కర్నూలులో 0.9 మి.మీ నర్సాపూర్లో 0.6 మి.మీ నమోదైంది. వర్షాల క్రమంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు నమోదవుతుండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. శనివారం బాపట్లలో గరిష్టం 34.5, కనిష్టం 26.1, కాకినాడలో గరిష్టం 31.1, కనిష్టం 26.4, కళింగపట్నంలో గరిష్టం 33.2, కనిష్టం 26.8, కావలిలో గరిష్టం 36.5, కనిష్టం 28.9, మచిలీపట్నంలో గరిష్టం 31.6, కనిష్టం 26.9, నందిగామలో గరిష్టం 29.6, కనిష్టం 27.3, నర్సాపూర్లో గరిష్టం 31.2, కనిష్టం 28.1, నెల్లూరులో గరిష్టం 35.7, కనిష్టం 28.5 డిగ్రీల వరకు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa