రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులకు పాల్పడినట్టు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడితో తాత్కాలికంగా మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసినట్టు పేర్కొంది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లలో ఒక దానిని నగర శివారులో కూల్చివేశామని, మరో రెండింటిని సాంకేతికత సాయంతో అడ్డుకున్నామని తెలిపింది. ఈ దాడిలో కార్యాలయ సముదాయం ధ్వంసమైందని, ఎవరీకీ ఎటువంటి గాయాలు కాలేదని వివరించింది.
ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 500 కి.మీ (310 మైళ్ల) దూరంలో ఉన్న మాస్కో, దాని పరిసరాలను ఉక్రెయిన్లో సంఘర్షణ సమయంలో చాలా అరుదుగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం చోటుచేసుకున్న దాడి ఇటీవలి డ్రోన్ దాడుల్లో తాజాది. ఉక్రెయిన్తో సరిహద్దుకు సమీపంలో ఉన్న క్రెమ్లిన్ సహా రష్యన్ నగరాలపై ఇటీవల కీవ్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తోంది. దీనిని ఉగ్రదాడిగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
‘జులై 30న ఉదయం మాస్కో నగరంలోని జనావాసాలపై మానవరహిత వైమానిక వాహనాలతో కీవ్ ఉగ్రవాద దాడికి ప్రయత్నించి విఫలమైంది.. మాస్కో ప్రాంతంలోని ఒడింట్సోవో జిల్లా భూభాగంలో వాయు రక్షణ వ్యవస్థలు ఉక్రెయిన్కు చెందిన ఓ డ్రోన్ను మార్గమధ్యలోనే ధ్వంసం చేశాయి.. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా మరో రెండు డ్రోన్లు అడ్డుకున్నాం.. ఈ సమయంలో మాస్కో నాన్-రెసిడెన్షియల్ బిల్డింగ్ కాంప్లెక్స్పై డ్రోన్ కూలింది’ అని వివరించింది. డ్రోన్ దాడుల్లో రెండు ఆఫీసు కార్యాలయాలు ధ్వంసమయ్యాయని మాస్కో నగర మేయర్ సెర్గియే సోబియనిన్ టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు.
రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశాం.. విమానాలు ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించాం’ అని రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో డ్రోన్ దాడుల కారణంగా నగరం నైరుతి దిశలో అదే విమానాశ్రయంలో విమాన రాకపోకలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఇటీవల వారాలుగా మాస్కోపై కీవ్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తోంది. అయితే, అమెరికా, నాటో మిత్రదేశాల సహాయం లేకుండా కీవ్కు ఇటువంటి దాడుల సాధ్యం కాదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ రోస్టోవ్ ప్రాంతంపై రెండు క్షిపణులను అడ్డుకున్నామని, టాగన్రోగ్ నగరంపై శిధిలాలు పడటంతో కనీసం 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత అజోవ్ నగరానికి సమీపంలో S-200 క్షిపణిని కూల్చివేశామని, శిధిలాలు జనావాసాలు లేని ప్రాంతంలో పడిపోయాయని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa