ఏర్పడనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. బుధవారం నాటికి ఈ ప్రభావం మొదలవుతుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడనం ఏపీవైపు కదిలితే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మూడు రోజుల మాత్రం తేలికపాటి జల్లులు పడతాయంటున్నారు. మంగళవారం అల్పపీడన ప్రభావం, వర్షాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఏపీలో చెదురుమదురు వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. అది వేగంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, విశాఖకు దగ్గర్లో ఉందని.. దాని వల్ల తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మూడు రోజులు వర్ష సూచన ఉంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారుతోంది.. మళ్లీ ఆకాశం మేఘావృతం అవుతోంది. ఈ అల్పపీడనం ప్రభావం మంగళ, బుధవారాల నుంచి కనిపిస్తుంది అంటున్నారు. అలాగే IMD సూచన ప్రకారం.. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీద ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఆ ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని.. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ అల్పపీడనం మయన్మార్ వైపు నుంచి.. ఏపీ వైపుగా కదులుతోంది. ఏపీ వైపు వస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో చిరుజల్లుల నుంచి తేలికపాటి వానలు పడతాయంటున్నారు. ఆదివారం వర్షాలు కాస్త తగ్గముఖం పట్టినా సోమవారం నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయంటున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావణశాఖ అంచనా వేస్తోంది. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీగా వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేశారు.. సోమవారం మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు.
ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 4.3, మేడ్చల్లో 3.7, మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్లో 3.5, యాదాద్రి జిల్లా బీబీనగర్లో 2.7, నిర్మల్ జిల్లా విశ్వనాథ్పూర్ 2.7, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్ 2.6, మేడ్చల్ జిల్లా కేశవరం 2.6, ఆలియాబాద్ 2.5, బండ మాదారంలో 2.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని బాచుపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, నేరెడ్మెట్తో పాటు ప్రాంతాల్లో వానలు పడ్డాయి.
గోదావరి వరద ఉధృతి కొనసాగుతోందంటోంది ఏపీ విపత్తుల నిర్వహణశాఖ. భద్రాచలం వద్ద నీటిమట్టం 55.1 అడుగులు ఉందని.. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.66 లక్షల క్యూసెక్కులుగా తెలిపారు. సహాయక చర్యల్లో 4 ఎన్డీఆర్ఎఫ్, 6 SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు ధవళేశ్వరం దగ్గర సోమవారం నుంచి వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.. ధవళేశ్వరం వద్ద వరద నిలకడగా ఉంది. ఇన్, ఔట్ ఫ్లో 16.32లక్షల క్యూసెక్కులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa