కడప జిల్లా ప్రొద్దుటూరులో యువకుడి అనుమానాస్పద మృతి కలకలంరేపింది. రామేశ్వరం ప్రాంతంలో స్నేహితుడి ఇంట్లో సతీష్ మరణించగా.. నెల రోజుల తర్వాత ఘటయన బయటపడింది. సతీష్ అనే యువకుడు నెల రోజుల క్రితం కుటుంబసభ్యులతో గొడవ పడి ఇంటి నుండి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి వెళ్లి నేరుగా తన స్నేహితుడు కిషోర్ ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కిషోర్ తల్లి నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చారు.
ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో కిషోర్ తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై ఆరా తీస్తే.. సతీష్ కిషోర్ ఇంట్లో మద్యం సేవించి పడుకొని ఉండగా చనిపోయినట్లు చెబుతున్నారు. దీంతో కిషోర్ భయపడి సతీష్ మృతదేహాన్ని ఇసుకతో కప్పినట్లు తెలుస్తోంది. కిషోర్ దాదాపు నెలరోజులుగా శవం పక్కనే అదే ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రొద్దుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల రోజులుగా సతీష్ కనిపించకుండాపోతే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదా అన్నది క్లారిటీ లేదు. సతీష్ మద్యం సేవించి నిద్రలోనే చనిపోయినట్లు చెబుతున్నారు.. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కిషోర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే సతీష్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఈ ఘటన కలకలంరేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa