కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకర్గంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య లై డిటెక్టర్ టెస్టుపై సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. రామేశ్వరం మెట్ట, ఆనూరుమెట్ట మట్టి తవ్వకాలపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుపై ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన దొరబాబు.. గ్రావెల్ తరలింపు వ్యవహారంలో నిజాయితీని నిరూపించుకునేందుకు లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమని సవాల్ చేశారు. అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు దొరబాబు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో లై డిటెక్టర్ టెస్టుకు రావాలని ఒకరిపై మరొకరు ఛాలెంజ్లు చేసుకున్నారు.
దవులూరి దొరబాబు ఢిల్లీలో ట్రూత్ ల్యాబ్ అనుమతి తీసుకొని.. సంతకం చేసిన బాండ్ పేపర్లతో లైడిటెక్టర్ పరీక్షల కోసం మున్సిపల్ సెంటర్కు బయలుదేరారు. ఈ క్రమంలో దవులూరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెద్దపురం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తన నిజాయితీ రుజువు కాకపోతే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానన్నారు దొరబాబు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు.
ఇటు మాజీ మంత్రి చినరాజప్ప కూడా తాము కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమంటూ కౌంటర్ ఇచ్చింది. పార్టీ కార్యాలయంలో సమావేశమై పోలీసుల అనుమతి తీసుకుని మున్సిపల్ సెంటర్కు వెళతామన్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరగకుండా.. ముందస్తు జాగ్రత్తగా పిఠాపురంలోని వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఇరు పార్టీల నేతలపై నిఘా పెట్టారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa