ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్‌తో చెత్త సేకరణ ఆటోలకు ఛార్జింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2023, 06:35 PM

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ఆలోచనతో సరికొత్త ప్రయోగం చేస్తోంది. నగరంలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా.. చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వాహనాలకు అవసరమైన విద్యుత్ కోసం సోలార్ ప్లాంట్‌‌ను సిద్ధం చేస్తోంది. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి ప్రాంతంలో 500 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్ పనులు ముగింపు దశకు వచ్చాయి. ఈ సోలార్ ప్లాంట్‌లో ప్రతిరోజూ దాదాపు 2వేల 500 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుందని చెబుతున్నారు.


ఈ ప్లాంట్‌లో ఉత్తత్తి అయిన విద్యుత్‌ను గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరించే 220 ఎలక్ట్రికల్ ఆటోల ఛార్జింగ్ కోసం ఉపయోగించనున్నారు. యూఎన్ఐడీఎ పైలెట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు, విజయవాడతో పాటుగా మొత్తం 28 పట్టణాల్లో ఈ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ 220 ఎలక్ట్రిక్ ఆటోను ఇంటి ఇంటికి చెత్త సేకరణ కోసం కేటాయించింది. ఒక్కో ఆటో ప్రతి రోజూ 900 ఇళ్ల నుంచి చెత్తను సేకరిస్తోంది. ఇలా నగరాన్ని మొత్తం 66 క్లస్టర్లుగా విభజించారు.. ప్రతి క్లస్టర్‌లో 10 మైక్రో పాకెట్స్ ఉంటాయి.. అంటే ఒక్కో మైక్రో పాకెట్‌లో 300 ఇళ్లు ఉంటాయి.


కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ కోసం గతంలో 200 డీజిల్ ఆటోలు ఉండేవి.. వాటి స్థానంలో ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలోను తీసుకొచ్చారు. ఈ నిర్ణయంతో ఏడాదికి దాదాపు 7.20 లక్షల లీటర్ల డీజిల్ ఆదా కాబోతోంది. ఈ ఎలక్ట్రికల్ ఆటోల ఛార్జింగ్ కోసం విద్యుత్ కావాల్సి ఉంటుంది.. అందుకే ఈ జీఎంసీ అధికారులు ఈ సోలార్ ప్లాంట్‌ను ఇక్కడ ప్లాన్ చేశారు... దీనికి రూ.3కోట్ల ఖర్చవుతోంది. ఈ ప్లాంట్‌లో ప్రతి రోజూ అన్ని (220) ఎలక్ట్రికల్ ఆటోలకు ఛార్జ్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ టిప్పర్లను వినియోగించడం ద్వారా డీజిల్ వాడకం తగ్గడంతో పాటుగా వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుందంటున్నారు. గుంటూరును కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు సైతం ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.


ఈ ప్లాంట్‌ను నగరంలో ఏర్పాటు చేసేందుకు సరిపడా స్థలం లేదని.. అందుకే అందుకే ఇలా సంగం జాగర్లమూడి దగ్గర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్ గుంటూరు వవాటర్ సప్లై రిజర్వాయర్‌కు సమీపంలో ఉందని అధికారులు తెలిపారు. మొత్తం మీద ఈ సోలార్ ప్లాంట్ ద్వారా వాయు కాలుష్యం తగ్గించడంతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌‌‌కు అవసరమైన విద్యుత్‌‌ను సమకూర్చుకోవచ్చు అంటున్నారు. మొత్తానికి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త ఆలోచన ప్రశంసలు అందుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa