ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్రోహం చేశారంటూ,,,వైసీపీ ఎమ్మెల్యేపై ఎంపీటీసీ ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2023, 06:49 PM

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం  సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, మహిళా నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళా ఎంపీటీసీ నిలదీశారు. తనకు ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఓజిలి మండలం కురుగొండలో వైఎస్సార్‌సీపీ చెందిన మాజీ ఎంపీపీ ఇందిరమ్మ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లగానే ఎమ్మెల్యేను ఇందిరమ్మ నిలదీశారు.


రూ.3 లక్షలు ఖర్చు చేసి సాధారణ ఎన్నికల్లో స్థానికంగా ఎమ్మెల్యేకు ఆధిక్యం తెప్పించాను అన్నారు. స్థానిక ఎన్నికల అనంతరం తనకు ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రెండో సారి ఎంపీపీ పదవి రాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. తనకు పదవులు కొత్త కాదని.. తాను గతంలో వదిలేసిన పదవి కోసం తానెప్పుడూ బాధపడలేదని ఇందిరమ్మ అన్నారు. తమ గడపకు ఎందుకు వచ్చారని ఎమ్మెల్యే సంజీవయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ వద్దని ఇందిరమ్మ భర్త ప్రభాకర్‌ అడ్డుకున్నా వినకుండా ఎమ్మెల్యే సంజీవయ్యపై మండిపడ్డారు. ఇందిరమ్మ ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీటీసీగా ఉన్నారు.


ఇందిరమ్మ మండల పరిషత్‌ ఎన్నికల్లో ఎంపీపీ పదవిని ఆశించారట. ఆమెకు ఆ పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే పట్ల కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ నివాసానికి వెళ్లగా ఆమె సీరియస్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa