శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గడప గడప కు మన ప్రభుత్వం 110వ రోజు బండి ఆత్మకూరు మండలం జీసీ పాలెంలో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి నిరంతరాయంగా ఎమ్మెల్యే ఇంటింటా పర్యటిస్తున్నారు. నాలుగేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలుతో పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని రాజాం అసెంబ్లీ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. వంగర మండలంలోని మరువాడ సచివాలయ పరిధిలో పాత మరువాడ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఎంపీపీ యూ.సురేష్ ముఖర్జీ, జెడ్పీటీసీ ప్రతినిధి కరణం సుదర్శన్ రావు, సర్పంచ్ గాడి కృష్ణవేణి, ఎంపీటీసీ పిల్లి ప్రేమమ్మ, స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరిగి నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి పొందిన లబ్ది తెలియజేస్తూ బుక్ లెట్లు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa