తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడ్డానని తనపై లోకేష్ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తాను వ్యాపారాల్లో కోట్లాది రూపాయిలు సంపాదించానని ఎమ్మెల్యే వేణుగోపాల్ తెలిపారు. అయితే, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. హైదరాబాద్లో విల్లా ఉందని లోకేష్ అంటున్నారని.. తనకు హైదరాబాద్లోనే కాదు బెంగుళూరులో కూడా రూ. 30 కోట్ల విల్లా ఉందని వెల్లడించారు. లోకేష్ వస్తే చూపిస్తానని మద్దిశెట్టి వేణుగోపాల్ వెల్లడించారు.
తన కంపెనీలోనే 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారని.. కేవలం జీతాల రూపంలోనే నెలకు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే వేణుగోపాల్ చెప్పారు. చిల్లర పనులకు పాల్పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. పన్నుల రూపంలోనే ప్రభుత్వాలకు వందల కోట్లు రూపాయిలు చెల్లించానని తెలిపారు. వేల కోట్ల రూపాయిల వ్యాపారాలు చేస్తున్నానని చెప్పారు. ఒక వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు లోకేష్ కొంచెమైనా స్టడీ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. ఎన్నికల అఫిడవిట్లోనే తన ఆస్తులు, కంపెనీల వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. నారా లోకేష్కు దమ్ముంటే దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నానని సవాల్ విసిరారు. తనపై నిందారోపణలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa