కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగస్టు 3న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ప్రధానితో ఆయన తొలిసారి సమావేశం కానున్నారు. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11 గంటలకు సిద్ధరామయ్య మోదీతో సమావేశమై చర్చలు జరుపుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.అదే రోజు ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో భేటీ కానున్నారు. అలాగే, 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై వ్యూహరచన చేసేందుకు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మంత్రులతో కలిసి ఆగస్టు 2న న్యూఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలవనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa