సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు మాటలన్నీ పచ్చి అబద్ధాలే అని కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలో నూతన బస్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎంపీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... సెల్ ఫోన్ తానే కనిపెట్టాను అంటాడు.. ఎండ నుంచి కరెంట్ తానే తయారు చేశాను అంటాడు. ఆయన రాయలసీమకు ద్రోహం చేసి, సాగునీటి ప్రాజెక్టులు సందర్శన పేరుతో సిగ్గులేకుండా ఎలా పర్యటిస్తున్నాడో అర్ధం కావడం లేదు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని ఎంతో ధైర్యంగా, ఎంతో గంభీరంగా కళ్లు ఆర్పకుండా గట్టిగట్టిగా అరుస్తూ చెప్పగలిగిన వ్యక్తి చంద్రబాబు. పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11వేల క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్నప్పుడు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించాలంటే సరిపోవు.దాంతో, దాన్ని నాలుగు రెట్లు అంటే 44వేల క్యూసెక్కుల సామర్ధ్యానికి పెంచిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్సార్ గారిది. ఈ 6 జిల్లాలకు నీళ్లిచ్చేందుకు 44వేల క్యూసెక్కులకు పెంచితే చంద్రబాబు, ఆయన వందిమాగధులతో ధర్నాలు చేయించాడు. అప్పట్లో టీడీపీ శాసనసభ్యుడు నాగం జనార్ధనరెడ్డితో జడ్చర్లలో, ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమాతో ధర్నాలు చేయించాడు. ఇవన్నీ ప్రజలు చూసినవే... కానీ చంద్రబాబు మాత్రం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa