సంక్షేమంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త శకానికి నాంది పలికారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో అమలవుతోందని, ప్రజల వద్దకే నేరుగా ప్రభుత్వ పాలన అందుతోందన్నారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల కుటుంబాలను జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కలిశామన్నారు. అర్హులందరికీ వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందించామని చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అమరావతి పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. చంద్రబాబులా మా ప్రభుత్వం ఎవరికీ దోచి పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa