ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌ ఘటనపై బంద్ ప్రకటించి విజయవంతం చేసిన మన్యం ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 03:14 PM

మణిపూర్‌లో ఆదివాసీలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా  రాష్ట్ర మన్యం బంద్‌ అల్లూరి జిల్లాలో విజయవంతమైంది. ఇందులో భాగంగా పాడేరులో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి మద్దతు పలికారు. గిరిజన సంఘం నాయకులు ఉదయం ఐదు గంటలకే పీటీడీ కాంప్లెక్స్‌కు చేరుకొని బస్సులను బయటకు రాకుండా చేశారు. ప్రైవేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి. గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ మణిపూర్‌ ఘటనకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టక పోవడం విచారకరమన్నారు. దేశంలోని ఆదివాసీలను రక్షించాలని, అటవీ సంరక్షణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుంచి ఆదివాసీలను మినహాయించాలి, బోయవాల్మీకి, బోంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని, రాష్ట్రంలో రద్దు చేసిన జీవో నంబరు 3కు చట్టభద్రత కల్పించాలని, పోలవరం వరద బాధితులకు పునరావాస కేంద్రాలు కల్పించాలని, చింతపల్లి, అనంతగిరి మండలాల్లో పవర్‌ ప్రాజెక్టు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa