చంద్రబాబు కావాలనే టీడీపీ కార్యకర్తలని దాడులకు ఉసిగొల్పాడని రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అయన మాట్లాడుతూ.... అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం, పక్కా స్కెచ్ తో తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో దాడులు చేయించాడు. అంతా వారు ముందే ప్లాన్ చేసుకున్నట్లుగానే ఈ ఘటనకు కారణమయ్యాడు. నిన్న రాత్రి 10.30 గంటలకు టీడీపీ నేతలు ఇక్కడ మీడియాకు పుంగనూరు పట్టణానికి చంద్రబాబు రావడం లేదని, బైపాస్ మీదుగా వెళ్తున్నామని సమాచారం అందించారు. పోలీసులకు కూడా పుంగనూరుకు రావడంలేదనే చెప్పారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చంద్రబాబు పాలనలో తమకు జరిగిన అన్యాయం పట్ల నిరసన కార్యక్రమం పెట్టుకుని.. ఆయన కోసం ఉదయం 10.30 వరకు ఎదురుచూశారు. కానీ, ఆయన ఇటువైపు రావడంలేదని తెలిసి వారంతా వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు పనిగట్టుకుని .. కావాలని రెచ్చగొట్టడానికి పుంగనూరుకు వచ్చాడు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకూడదని పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. కానీ, ఈరోజు కావాలనే పనిగట్టుకుని ఆలస్యంగా పుంగనూరు వైపు వచ్చి ప్రజలను రెచ్చగొట్టారు. పోలీసులు కూడా సమాచారం లేకుండా ఎలా వస్తారని అడిగినందుకు వాళ్లను రక్తాలు కారేటట్టు కొట్టారు. పోలీసుల్ని కర్రలతో, రాడ్లతో కొట్టారు. రాళ్లు విసిరి పోలీసుల తలలు పగులకొట్టారు. వారి జీపులు, వాహనాలను కూడా టీడీపీ వారు దాడులు చేసి ధ్వంసం చేసి తగులబెట్టారు. పుంగనూరు, అంగళ్లులో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. కిరాయి గుండాల్ని తెచ్చుకుని.. కార్లలో గన్లను పెట్టుకుని వచ్చారు. ఆ గన్లున్న కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa