ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామ సచివాలయం పరిధిలోని అఖింఖాన్ పేట, పెయ్యలవానిపేట గ్రామాల్లో గడపగడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 548 ఇళ్లను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్బంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి గడప గడపకు-మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని, వాటిని పరిష్కరించేందు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయ లేదా అని తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజా రంజక పాలన సాగిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నిత్యం ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు వాస్తవం తెలుసునని అందుకే వారి ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa