2023 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా నిధులను నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ త్రైమాసికంలో అర్హులైన 18,883 జంటలకు గానూ రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి వధువుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. పేద తల్లిదండ్రులు పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యతకు అండగా నిలుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ‘వైయస్ఆర్ కళ్యాణమస్తు’, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు ‘వైయస్ఆర్ షాదీ తోఫా’ ద్వారా ఆర్థిక సాయాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa