ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ పాదయాత్రలో భాగస్వాములు కానున్న అమరావతి రైతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 05:29 PM

 టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 13 నుంచి లోకేశ్ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోకి ప్రవేశించనుంది. ఈ పాదయాత్రలో రాజధాని గ్రామాల ప్రజలు, రైతులకు, మహిళలకు, రైతు కూలీలు పాల్గొనాలని రాజధాని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. లోకేశ్‌ యువగళం పాదయాత్రకు 13, 14 తేదీల్లో తాడికొండ నియోజకవర్గంలో వెంట నడవాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. ఈనెల 15న నిడమర్రులోకి పాదయాత్ర రానుంది. తద్వారా లోకేశ్‌ సొంత నియోజకవర్గం మంగళగిరిలో యువగళం పాదయాత్ర ఎంటర్‌కానుంది. ఈ యువగళం పాదయాత్రలో అమరావతి గ్రామాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు పార్టీలకతీతంగా పాల్గొనాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa