పుంగనూరు ఘటనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు బనాయించడంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమే చంద్రబాబు మీద హత్యాయత్నం కేసు అని మండిపడ్డారు. కేసులు పెట్టి ఆపాలని చూస్తున్నారు. అంతకు రెట్టింపుతో వైసీపీ అవినీతి అక్రమాలు బయట పెడతామన్నారు. అవసరమైతే జైల్ భరో కార్యక్రమంతో జైళ్లలో తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. అవసరమైతే క్విట్ ఇండియా లాగా ఈ రాష్ట్రం నుంచి క్విట్ జగన్ కార్యక్రమం చెబుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటిస్తూ ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రశ్నిస్తూ ముందుకెళుతుంటే ఈ వైసీపీ నాయకులకు మింగుడు పడలేదని ఆయన మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa