ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎందుకు దాడి చేసారు...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 05:38 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిపై  దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని ప్రశ్నించారు. సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి ప్రతీక అని విరుచుకుపడ్డారు. ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వేదాలు చదివి భగవంతుని సేవలో ఉండే అర్చకులపై దాడి చేయడం, వారిని ఇబ్బందిపెట్టడం రాక్షసత్వమే అని మండిపడ్డారు. ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగాణాల్లో అహంకారం, అధికార దర్పం చూపడం క్షమార్హం కాదన్నారు. అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని ఒక అర్థం లేని నిర్ణయం తీసుకున్నారని.. జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారని జనసేనాని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa