కేంద్ర ప్రభుత్వం సర్పంచ్లకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుంది అంటూ బీజేపీ మహాధర్నాకు దిగింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంది. గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు, ఉభయ పార్టీల నేతలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు. కాగా.. రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం పోలీస్స్టేషన్లోనే నేతలు ధర్నాను కొనసాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన సహా మరో 50 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa