పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం చండ్రాజుపాలెం నుంచి 180వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... . ‘‘బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు!. రాష్ట్రంలో వైసీపీ ఇసుకాసురులకు కోర్టు తీర్పులంటే లెక్కలేదు. పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు శివార్లలో వైసీపీ నేతలు యథేచ్చగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలు నా కంటపడ్డాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ మాఫియాలు యథేచ్చగా ఇసుక దోపిడీకి తెగబడుతున్నాయి. జలగన్న పాలనలో అంబేద్కర్ రాజ్యంగం, చట్టాలకు విలువలేదు. వైసీపీ దొంగలకు తెలిసిందిల్లా అందినకాడికి దోచేయడం, తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయడమే!’’ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa