రాజమహేంద్రవరం పరిధిలోని పంచాయతీ వార్డులకు ఉపఎన్నిక ఈనెల 19న జరగనుంది. జిల్లాలో మొత్తం 22 వార్డులకు ఉప ఎన్నికలు ప్రకటించగా, 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 8 వార్డుల్లో టీడీపీ, వైసీపీ హోరాహారీగా తలపడుతు న్నాయి. ఈ వార్డుల్లో 18 మంది పోటీలో ఉన్నారు. పరోక్ష ఎన్నికలు కావడం వల్ల వెలుపల నుంచే అభ్యర్థులను ఆయా పార్టీలు బలపరుస్తున్నాయి. కోరుకొండ మండలంలోని బుచ్చింపేట పంచాయతీ పరిధిలోని 7 వార్డుకు ఈసారీ కూడా పోటీ లేదు. గతంలో ఈ వార్డు నుంచి పోటీ చేసిన వారు మృతిచెందారనే కారణంతో మూడు దఫాలుగా ఎవరూ నామినేషన్లు వేయడం లేదు. ఈసారి ఒకరు నామినేషన్ వేసినా అది స్ర్కూట్నీలో పోయింది. దీంతో ఈ స్థానం ఈసారీ కూడా ఖాళీనే. అనపర్తి మండలంలోని మూడు వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయింది. మరో రెండు వార్డులలో టీడీపీ, వైసీపీ మద్దతుదారులు పోటీపడుతున్నారు. ఇక్కడ ద్విముఖ పోటీనే జరుగుతోంది. గోపాలపురం మండలంలో రెండు వార్డులకూ పోటీ జరు గుతోంది. అక్కడ ఏకగ్రీవం కావడానికి ప్రయత్నించినప్పటికీ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు బలమైన అభ్యర్థులను పోటీలో పెట్టారు. ఈ రెండు వార్డుల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కడియంలో ఒక వార్డు ఉంది. అది ఏకగ్రీవమైంది. కొవ్వూ రు మండలంలో ఒక వార్డు కోసం పోటీపోటీ నడుస్తోంది. ద్విముఖ పోటీ ఉంది. నిడదవోలులో మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పెరవలి మండలంలోని ఒక వార్డు ఉండగా, అది ఏకగ్రీవమైంది. రాజానగరం మండలంలో ఐదు వార్డులకుగానూ, మూడు ఏకగ్రీవం అయ్యాయి. రెండింట ద్విముఖపోటీ నడుస్తోంది. సీతానగరం మం డలంలో మూడు వార్డులు ఉండగా, మూడు ఏకగ్రీవం అయ్యాయి. ఉండ్రాజవరం మండలంలో రెండు వార్డులకుగానూ, ఒకటి ఏకగ్రీవం అయింది. మరో వార్డుకు ద్విముఖ పోటీ జరుగుతోంది. 19న పోలింగ్ జరుగుతుంది. అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa