పోలీసులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకుంటే సెప్టెంబరు 1నుంచి పెన్నానదిలో వంటావార్పు కార్యక్రమం చేపడతానని టీడీపీ మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెన్నానదిలో పెద్దఎత్తున ఇసుక తరలిపోతున్నా పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. అక్రమ రవాణాను వారు అడ్డుకోకుంటే తామే అడ్డుకోవడంతోపాటు ఇసుక తరలిస్తున్న వాహనాలకు గాలి తీసివేస్తామని హెచ్చరించామన్నారు. అయినప్పటికి పోలీసు అధికారుల్లో ఎలాంటి చలనం లేదన్నారు. వారిలో చలనం తెప్పించేందుకు అక్రమ ఇసుక తరలింపును అడ్డుకొనేందుకు నడుం బిగించానన్నారు. పెద్దఎత్తున అక్రమ ఇసుక తరలింపుకు ఒకరిద్దరు పోలీసు అధికారుల అవినీతి కారణమని విమర్శించారు. పోలీసు అధికారులు నిజాయితీగా వ్యవహరించి ఉంటే ఎప్పుడో అక్రమ ఇసుకకు అడ్డుకట్ట పడేదని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa