వారాహి విజయ యాత్రలో భాగంగా బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించారు. భీమిలి నియోజకవర్గంలో అరుదైన ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. వైసీపీ పాలనతో ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసానికి గురవుతున్నాయని ఆరోపించారు. చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వల్ల ఎర్రమట్టి దిబ్బలు కుంగిపోతున్నాయని, వాటికి కనీస రక్షణ లేదని ఆరోపణలు చేశారు. మట్టి కనపడితే చాలు వైసీపీ నేతలు దొచేస్తున్నారని, ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాలు దోపిడీకి గురయ్యాయని విమర్శించారు.
మిగిలిన 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బలను మనం రక్షించుకోవాలని, ఇది మన వారసత్వ సంపద అని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉత్తరాంధ్రలో టూరిజం ముసుగులో అక్రమాలు జరిగాయని, కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి వీటిని తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణలో పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, అలాగే ఉత్తరాంధ్రలో కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్తులకు, గవర్నమెంట్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తుల్లాగా భావిస్తున్నారని, ఉత్తరాంధ్రపై దోపిడీ ఆగాలని చెప్పారు.
'మిగిలిన 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల చుట్టూ కనీసం ఒక 30 ఎకరాల రక్షణ భూము ఉండాలి.. కానీ కనీసం 100 అడుగులు కూడా ఉంచలేదు. దీని చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నాం.. దీనికి రక్షణగా చర్యలు తీసుకుంటారో లేదో చెప్పాలి. 32 భారత వారసత్వ ప్రదేశాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఒకటి. 1200 ఎకరాల్లో ఉండే ఈ మట్టి దిబ్బలు ఈ రోజు కేవలం 292 ఎకరాలు మాత్రమే మిగిలాయి. తెలిసో, తెలీకో కొంత ప్రాంతం రక్షణ శాఖకు ఇచ్చారు. మిగిలిన ప్రాంతాన్ని కూడా దొచేస్తున్నారు. ఆసియా ఖండంలో కేవలం ఏపీ, తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం ఈ ఎర్రమట్టి దిబ్బలు.. దాదాపు 20వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ప్రాంతం.. వీటిని మనం కాపాడుకోవాలి' అనని పవన్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa