యువ ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. ఓటర్ల జాబితా సర్వే పరిశీలనపై కలెక్టరేట్లో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ దిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటర్ల జాబితా పరిశీలనను జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 65 శాతం పైగా పూర్తి చేశామని, ఈ నెల 21 లోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు. యువ ఓటర్లు ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఓటర్ల జాబితా నూరుశాతం స్వచ్ఛీరణతో ఎటువంటి తప్పులు లేని జాబితా రూపొందించేందుకు సహకరించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. బిఎల్వోలు జాబితా పరిశీలనను మరింత వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె. మోహన్కుమార్, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa