ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని పురంధేశ్వరి ఇవాళ ప్రకటించారు. 30 మందితో ఏపీ బీజేపీ కమిటీని నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా విశ్వనాథరాజు, బిట్ర శివన్నారాయణ, దయాకరక్ రెడ్డి, తపన చౌదరి, ఎన్ మధుకర్ జీకి అవకాశం కల్పించారు. ఇక ఉపాధ్యక్షులుగా మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, శ్రీదేవి, అయ్యాజీ వేమ, కొత్తపల్లి గీతలను నియమించారు.
ఇక వాకాటి నారాయణరెడ్డి, కోడూరు లక్ష్మీనారాయణ చందూ సాంబశివరావులకు ఉపాధ్యక్షులుగా కమిటీలో అవకాశమిచ్చారు. అలాగే 10 మందిని సెక్రటరీలుగా నియమించారు. ఆఫీస్ సెక్రటరీ, హెడ్క్వార్టర్ ఇన్ఛార్జ్, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్ పదవులను భర్తీ చేశారు. రమేష్ నాయుడు, సురేంద్ర, కోలా ఆనంద్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సెక్రటరీగా అవకాశం ఇచ్చారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని బీజేపీ అధిష్టానం నియమించింది. గత కొద్దిరోజుల క్రితం ఆమెను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన జారీ చేశారు. అంతకుముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు. ఆయన పదవీకాలం ముగియడంతో కొత్తవారికి అవకాశం కల్పించారు. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో పలువురి పేర్లు వినిపించాయి. సత్యకుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనను దాదాపు నియమించడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో పురంధేశ్వరి పేరు తెర మీదకు వచ్చింది. ఊహించని విధంగా పురంధేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడానికి కారణం ఏంటనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని జిల్లాల్లో పురంధేశ్వరి పర్యటిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. అలాగే స్థానిక నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త టీమ్ను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా తాజాగా రాష్ట్ర కార్యవర్గాన్ని పురంధేశ్వరి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa