నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో చీకటిపాలన కొనసాగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా అమలాపురంకు చంద్రబాబు విచ్చేశారు. ఇక్కడి గడియారం స్తంభం సెంటర్ లో ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రసంగిస్తూ... సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి రోజూ ప్రజలను దోచుకోవడమేనని పేర్కొన్నారు. రేపు జరిగే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే పోరాటం అంట... అబ్బ... ఎంత ఆరాటం అయ్యా ఈయనకు! అంటూ వ్యాఖ్యానించారు. పేదల రక్తాన్ని తాగే జలగ... ఈ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదవాళ్లను దోచేశాడు... ఇక మిగిలింది మీ గోచీ మాత్రమే... రేపు మళ్లీ ఇతనే వస్తే మనకు గోచీ కూడా మిగలదు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో దోమల బెడద ఎక్కువైందన్నారు. రాని విద్యుత్ కు కూడా చార్జీల పేరుతో భారం మోపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి సీఎం నిర్ణయాల వల్ల ప్రజలపై భారం పడిందని, ప్రజల్లో అప్పులేని వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచబోనని, అవసరమైతే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చంద్రబాబు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa