ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం వీరమ్మగుంట గ్రామంలో పంచాయతీ ఉపఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ పరిస్థితిని పరిశీలించేందుకు టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. అయితే ఆయనను నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చేందుకు చింతమనేని ప్రయత్నించారు. ఈ క్రమంలో రౌడీషీటర్ పోలింగ్ కేంద్రం వైపు రానివ్వకు అంటూ డీఎస్పీ చెప్పారు. దీంతో చింతమనేని వాగ్వాదానికి దిగారు. తాను రౌడీషీటర్ అయితే బైండోవర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాసేపు వాగ్వాదం చోటుచేసుకున్న తర్వాత కూడా చింతమేనిని డీఎస్పీ అశోక్ అనుమతించలేదు. దీంతో చింతమనేని వెనక్కి వెళ్లిపోయారు. అయితే బై ఎలక్షన్లో టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటల యుద్ధంతో ఆగకుండా కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. దీంతో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది.
అటు పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల గొడవలు జరిగాయి. హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాస్ రావు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాలకృష్ణ పీఏ, టీడీపీ నేత శ్రీనివాసరావు, అనుచరులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ బాలకృష్ణ పీఏ దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa