ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు, రేపు ఏపీఎన్జీవో రాష్ట్ర మహాసభలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 12:30 PM

విజయవాడలో సోమ, మంగళవారాల్లో జరిగే ఏపీఎన్జీవో రాష్ట్ర 21వ మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. ఈ సభల్లో సంఘ సమస్యలపై విస్తృతంగా చర్చించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలు తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ మహాసభలకు ఈ సారి కూడా సీఎం జగన్‌ తొలిరోజు హాజరవుతారని పేర్కొన్నారు. సంఘం తాలూకా, జిల్లా రాష్ట్ర కార్యవర్గ సంఘ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ఆయనవెంట ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa