తిరుమల కొండపైకి నడక మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. కాలిబాట మార్గంలోని నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో సంచరిస్తున్న చిరుతని బంధించేందుకు అటవీ ప్రాంతంలో బోన్లను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి నరసింహస్వామి ఆలయం వద్ద ఎలుగు బంటి సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటిని బంధించేందుకు అటవీ అధికారులు యత్నిస్తున్నారు. నడకదారిలో భక్తులను అప్రమత్తం చేస్తూ.. గుంపులు గుంపులుగా తిరుమలకు భద్రతా సిబ్బంది పంపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa