చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ ధరపై గతేడాది వివాదం నడిచిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే ఆలయ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ టికెట్ ధర పెంచారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచార చేయడంతో.. ఓ నెటిజన్ ఏపీ ఫ్యాక్ట్చెక్ టీమ్ నుంచి క్లారిటీ కోరారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి పంచామృత అభిషేకం టిక్కెట్టు ధర రూ.700 మాత్రమే అన్నారు.. ఇందులో ఎలాంటి పెంపూ లేదని తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టిక్కెట్టు ధర రూ.750 నుంచి ఏకంగా రూ.5,000కు పెరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు.
గతేడాది కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ ధర పెంపుపై దుమారం రేగింది. టికెట్ ధర ఒకే సారి రూ.700 నుంచి రూ.5వేలకు పెంచడంతో భక్తుల నుంచి అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే దేవాదాయశాఖ స్పందించింది.. అభిషేకం టికెట్ ధర పెంచలేదన్నారు. ఇప్పటి వరకు ఉన్న రూ.700ల టికెట్ ధర యథావిధిగా కొనసాగిస్తామని దేవాదాయశాఖ కమిషనర్ తెలిపారు.
స్వామివారి అభిషేకం టికెట్ ధర రూ.700 నుంచి రూ.5వేలకు పెంచడానికి ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రజాభిప్రాయ సేకరణ పత్రం అవగాహనా రాహిత్యంగా పరిగణిస్తున్నట్టు దేవాదాయశాఖ తెలిపింది. ఈ అభిప్రాయ సేకరణ పత్రంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, టికెట్ ధర పెంపుపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే మంత్రి తెలిపారు. అంతేకాదు అభిషేకం టికెట్ వివాదాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. కాణిపాకం ఈవో సురేష్ బాబును బదిలీ చేశారు. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa