ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిక్స్ సదస్సు ఫొటో సెషన్ వేదికపై ,,,,జాతీయ జెండాను తీసి జేబులో పెట్టుకున్న ప్రధాని మోదీ

international |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 09:49 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌతాఫ్రికా రాజధాని జోహన్నెస్‌బర్గ్‌లో పర్యటిస్తున్నారు. 15 వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ.. జోహన్నెస్‌బర్గ్ వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు ప్రస్తుతం నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఎందుకంటే త్రివర్ణ పతాకానికి నరేంద్ర మోదీ ఇచ్చిన గౌరవం ఇప్పుడు ప్రశంసనీయంగా మారింది. జోహన్స్‌బర్గ్‌లో నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి ముందు గ్రూప్‌ ఫోటో దిగేందుకు బ్రిక్స్ దేశాల అధినేతలను స్టేజీ మీదకి పిలిచారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పిలవగానే వేదికపైకి చేరుకున్నారు.


అయితే ఆ స్టేజీ మీద ఉన్న జాతీయ జెండాను చూసిన ప్రధాని మోదీ.. స్జేజీపైన కాలు పెట్టకుండానే కిందికి వంగి.. ఆ త్రివర్ణ పతాకాన్ని తీసుకున్నారు. అనంతరం దాన్ని తీసుకుని తన కోటు జేబులో పెట్టుకున్నారు. అయితే ఫోటో సెషన్ సమయంలో ఆయా దేశాలకు సంబంధించిన నేతలు నిలబడేందుకు వారి స్థానాల్లో ఆయా దేశాల జాతీయ జెండాలను ఉంచుతారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నిలబడాల్సిన ప్రాంతంలో భారతీయ జెండాను ఉంచారు. అది చూసిన ప్రధాని మోదీ.. జెండా ఉన్న స్టేజీపై కాలు పెట్టకుండా దాన్ని తీసుకుని జేబులో పెట్టుకున్నారు.


అయితే ప్రధాని మోదీ కంటే ముందు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా స్టేజీపైకి ఎక్కారు. దీంతో మోదీని చూసి అనుసరించిన సిరిల్ రమాఫోసా.. కిందికి వంగి దక్షిణాఫ్రికా జాతీయ జెండాను తీసుకుని తన సహాయకుడికి ఇచ్చారు. అయితే మోదీ మాత్రం భారతీయ జెండాను తీసుకుని తన జేబులోనే పెట్టుకున్నారు. ఈ సన్నివేశం అక్కడ ఉన్నవారిని ఆకర్షించడంతో పాటు ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపే దృశ్యాన్ని వర్చువల్‌గా వీక్షించారు. చంద్రయాన్ సక్సెస్ అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు చెబుతూ ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. చంద్రయాన్ 3 కేవలం భారతీయలు విజయం మాత్రమే కాదని.. మొత్తం మానవాళి విజయం అని తెలిపారు. కాగా బ్రిక్స్‌ సదస్సులో.. బ్రెజిల్, రష్యా , భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు సభ్యత్వం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రొవ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఈ అత్యున్నత సదస్సుకు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa