పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం జిల్లాల పర్యటనల సందర్భంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తమ కుటుంబ దీనస్థితిని విన్నవించుకున్న ఎందరో అభాగ్యులకు ఉదారంగా సహాయం అందించి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విజయనగరం జిల్లా మెంటాడ మండల పర్యటన సందర్భంగా మానవతా హృదయంతో మరో మహిళకు ఆర్థిక సహాయం అందించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం బిల్లలవలస పంచాయతీ కొండదాడి గ్రామానికి చెందిన కన్నూరు సరస్వతి(34)ది ఒక విషాదగాథ. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్ వ్యాధితోనే మృతి చెందారు. ఆమెకు నా అనుకునేవారెవరూ లేరు. పైగా గత ఐదేళ్లుగా గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa