ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వంపై రెచ్చిపోయిన నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 26, 2023, 05:41 PM

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ యువనాయకులు  నారా లోకేశ్  రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని.. చిన్న వర్షానికే ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తికాక సాగునీరు అందడం లేదన్నారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి లేదని..తమ శాసనసభ్యుడు అవినీతి ఎక్కువ అయ్యిందన్నారు. సంక్షేమం కార్యక్రమాల్లో కులం, మతం చూడను అని జగన్ అన్నారని... కానీ ఇప్పుడు కులం, మతం, పార్టీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసారన్నారు. గ్రామంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొందన్నారు. శాసనసభ్యుడు కనీసం గ్రామానికి రారని.. తమ సమస్యలు పట్టించుకోరని వాపోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa