ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగళ్లు కేసులో టీడీపీ నేతలకి ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 12:45 PM

అన్నమయ్య జిల్లా అంగళ్లు ఘటనకు సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నానిలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. వారు పది రోజుల్లోగా ముదివేడు పోలీసుల ముందు లొంగిపోవాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. పోలీసు స్టేషన్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) సంతృప్తి మేరకు ఒక్కొక్కరు రూ.లక్ష బాండుతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అవి తీసుకుని వారిని బెయిల్‌పై విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. బెయిల్‌పై విడుదలయ్యాక పిటిషనర్లు నాలుగువారాల పాటు అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టరాదని స్పష్టం చేసింది. నెల రోజులపాటు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య ఏదో సమయంలో కర్నూలు మూడో పట్టణ పోలీసుల ముందు హాజరుకావాలని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa