ఈనెల 30 నుంచి సెప్టెంబరు 4 వరకు సీపీఎం ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ తెలిపారు. అనంతపురం జిల్లాలో వర్షాభావం, విద్యుత కోతల కారణంగా పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రాంభూపాల్ అన్నారు. నాలుగు లక్షల ఎకరాల్లో విత్తనం వేయలేదని, విత్తనం వేసిన 5.32 లక్షల ఎకరాల్లో సగానికి పైగా పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. దీన్ని అత్యంత తీవ్రమైన అంశంగా ప్రభుత్వం పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నెల 30 నుంచి ప్రజాసమస్యలపై సీపీఎం సమరభేరి చేపడుతుందని తెలిపారు. శింగనమల, రాప్తాడు, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లో జీపు యాత్రలు, అనంతపురం నగరంలో పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa