ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకి నష్టం వస్తే సహించం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 01:36 PM

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల సీపీఎం కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రమేష్‌కుమార్‌, కార్యదర్శి రాజశేఖర్‌, దళిత బహుజన సంఘం, ఎంఆర్‌పీఎస్‌, క్రిస్టియన్‌ సంఘం, కౌలు రైతు సంఘం, తదితర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు. చట్ట సవరణ చేసి భూములను పేదలకు దక్కకుండా భూస్వాములకు లాభపడేలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గుర్తించిన అసైన్‌మెంట్‌ భూమిని, లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. భూమిలేని పేదలకు భూములు పంచాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa