సీఎం జగన్ కి రైతులపై ప్రేమ లేదని.. జగన్ రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తావేజు విలేకర్లుకు టీడీపీ మద్దతు ఉంటుందిన్నారు. జగన్ పాలనలో ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ విధానం సరైనది కాదని.. రాష్ట్రంలో దోపిడీ ప్రధానంగా జరుగుతోందన్నారు. ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖపై సమీక్ష జరగడం లేదని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గం భయం గుప్పిట్లో ఉందన్నారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసే పరిస్థితి దాపురించిదన్నారు. తొండపిలో హిందూ దేవాలయం నిర్మాణం జరగాలంటే వైసీపీ కండువా కప్పు కోవాలని బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa