ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 02:08 PM

కర్నూలు జిల్లా, పాణ్యం మండలం బలపనూరు సమీపంలో శనివారం  బైక్‌లో వెళ్తున్న వైద్య విద్యార్థులను వెనుక నుంచి గ్రావెల్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెడికో పరమేష్(23) మృతి చెందగా, మరో విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి రెండు కాళ్లను కోల్పోయాడు. వీరు శాంతిరామ్ మెడికల్ కాలేజీలో చదువుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వైద్య విద్యార్థులను శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే పరమేష్ మృతి చెందాడు. పవన్ కుమార్ రెడ్డి రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అవడంతో వైద్యులు వాటిని తొలగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa