ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం ఎత్తుగడలకు జగన్ వత్తాసు పలుకుతున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 02:08 PM

జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయలేని స్థితిలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ‘రాష్ట్రాన్ని రక్షించండి-దేశాన్ని కాపాడండి’ నినాదంతో చేపట్టిన సీపీఐ బస్సు యాత్ర శుక్రవారం నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ....  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా, ఎత్తు తగ్గించే ప్రయత్నం చేయడంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మిస్తేనే గోదావరి, కృష్ణానదుల అనుసంధానం జరుగుతుందన్నారు. అప్పుడే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు నీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa