ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో రాజకీయ పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 03:18 PM

ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనేపథ్యలో కడప అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్న ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, సీనియర్‌ నేత అలంఖాన్‌పల్లెకు చెందిన లక్ష్మీరెడ్డి శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వేర్వేరుగా సమావేశమయ్యారు. కడప టీడీపీ టికెట్‌ను పలువురు ఆశిస్తున్నారని, వీలైనంత త్వరలో అభ్యర్ధులను ఖరారు చేయాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. తొలుత అలంఖాన్‌పల్లెకు చెందిన సీనియర్‌ నేత లక్ష్మీరెడ్డి ఆయన కుమారుడు మన్మోహన్‌రెడ్డితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కడపలో రాజకీయ పరిస్థితిపై ఆరా తీశారు. కడప టికెట్‌ను మా కుటుంబానికి ఇవ్వాలని, లేదా మైనార్టీలకు ఇవ్వాలని చూస్తే అమీర్‌బాబుకు ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. కడప టీడీపీ గెలుచుకోవాలంటే స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని లక్ష్మిరెడ్డి గట్టిగా చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడపలో బూత్‌ల వారిగా సేకరించిన సమాచారం ఓటర్ల నమోదు తదితర వివరాలను చంద్రబాబుకు లక్ష్మీరెడ్డి అందించారు. అనంతరం అమీర్‌బాబుతో సమావేశమయ్యారు. కడపలో టీడీపీ గెలవాలని, అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబుకు చెప్పారు. మైనార్టీలో అయితే టికెట్‌ నాకే ఇవ్వాలని అందరినీ కలుపుకుని పోయి ఈ సారి తప్పకుండా గెలిపిస్తామని అమీర్‌బాబు చెప్పినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa