అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ రెండు వర్గాలుగా విడిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్థానికంగా గ్రూపులు సహించేది లేదని అనకాపల్లి నేతలను హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గం నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. స్థానిక నేతలను అందరిని కలుపుకొని పోవాలని యలమంచిలి టీడీపీ ఇన్చార్జ్ ప్రగాఢ నాగేశ్వరావుకు చంద్రబాబు ఆదేశించారు. కైకలూరు నియోజకవర్గ నేతలతో పార్టీ పరిస్థితులపై చంద్రబాబు చర్చించారు. స్థానికంగా ఇన్చార్జీను ఇవ్వాలని కైకలూరు నేతలు కోరారు. కైకలూరు ఇన్చార్జీ పదవిని కొడాలి వినోద్, విజయలక్ష్మి, వెంకటరాజు ఆశిస్తున్నారు. చంద్రబాబుతో గుడివాడ నియోజకవర్గ పరిస్థితులపై చంద్రబాబు సమీక్షించారు. త్వరలోనే గుడివాడ అంశానికి క్లారిటీ ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa