తిరుమలలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్లోని 315 ఇంట్లోకి రాత్రి పునుగు పిల్లి దూరింది. పునుగు పిల్లిని చూసి స్థానికులు వెంటనే టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పునుగు పిల్లిని బంధించేందుకు ప్రయత్నించారు. అయితే పునుగు పిల్లి ఇంట్లోని పై భాగంలో ఉండటంతో పునుగు పిల్లిని బయటకు రప్పించేందుకు అటవీ శాఖ అధికారులు శ్రమించాల్సి వచ్చింది.
పునుగు పిల్లి అంతరించిపోతున్న జీవ జాతి కావడంతో.. అరుదైన జంతవుల్లో ఒకటి అని చెబుతుంటారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి విగ్రహానికి ఈ పిల్లి నుంచి తీసిన తైలాన్ని అభిషేకం తర్వాత ప్రతి శుక్రవారం పూస్తారని చెబుతారు. అందుకే వెంకటేశ్వరస్వామి కోసం వీటిని ప్రత్యేకంగా టీటీడీ పెంచుతోంది. ఈ పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పిల్లిని ఓ ఇనుప జల్లెడలో ఉంచుతారు.. అలాగే అక్కడ చందనపు కర్రను నిలబెడతారు.
ప్రతి పది రోజులకు ఒకసారి పునుగు పిల్లికి శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుంది. అలా మెల్లిగా పునుగు శరీరంపై కొంచెం అట్టలా ఏర్పడుతంది.. పిల్లి తన శరీరాన్ని ఇనుప జల్లెడలో ఉన్న చందనపు కర్రకు రుద్దడం వల్ల శరీరంపై చెమట ద్వారా వచ్చినదంతా బంకలా దానికి అంటుకుంటుంది. దీనిని తైలంగా ఉపయోగిస్తారు. ఈ పునుగు పిల్లిని ఇంగ్లిష్లో టాడీ క్యాట్, సివెట్ అంటారు. పునుగుపిల్లి భారత్తో పాటూ శ్రీలంకల, సింగపూర్, మయన్మార్, భూటాన్ దేశాల్లో మాత్రమే ఉంటుంది.
పుగును పిల్లి వన్యప్రాణి కావడంతో టీటీడీ గోశాలలో బంధించి పెంచడంపై గతంలోనే అభ్యంతరాలు వచ్చాయి. అయితే 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలో క్లాజును బట్టి దైవ కార్యక్రమాలకు వన్యప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. అందుకే ఈ చట్టం ప్రకారమే టీటీడీ పునుగు పిల్లులను పెంచుతుందట. పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో టీటీడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. తిరుమలలోని గోశాలలో పెంచుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa