ఒంటరిగా ఉంటున్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు యువకుల కోసం గాలింపు చేపట్టారు. బుధవారం ఒంగోలు స్థానిక పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ మలికగర్గ్ వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు మంగమూరు రోడ్డులో నివాసం ఉంటున్న ముండ్రు లక్ష్మీనవత అలియాస్ నవ్య, కరణం మోహనదీప్తి అలియాస్ దీప్తి, బాలాజీరావుపేటలో నివాసం ఉండే అలహరి అపర్ణ, రాజీవ్నగర్లో ఉంటున్న దాసరి భాను అలియాస్ షేక్ షాహేరభాను, బిలాల్నగర్కు చెందిన అన్నాబత్తున వినీత్కుమార్, లక్ష్మీనవత సోదరుడు బండారు పూర్ణ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాల బాట బట్టారు. ఈ క్రమంలో పేర్నమిట్ట సమీపంలోని శ్రీకృష్ణనగర్లో బ్యూటీషియన్ రజియా ఇంట్లో మం గళవారం దోపిడీకి పాల్పడ్డారు. రజియాకు మత్తు ఇచ్చి, ఆమెపై యాసిడ్ దాడి చేసి ఒంటిపై ఉన్న ఆభరణాలతోపాటు, బీరువాలో ఉన్న నగలు, రూ.40వేల నగదు మొ త్తం రూ.10లక్షల సొత్తును దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిం దితుల్లో నలుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి వద్ద 196 గ్రాముల బంగారం, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై సస్పెక్ట్డ్ షీట్లు తెరుస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa