తిరుమలలో మరో చిరుత బోన్కు చిక్కింది. 10 రోజుల క్రిత్తమే ట్రాప్ కెమెరా ద్వారా చిరుత సంచారాన్ని అటవీశాఖ గుర్తించారు. నరసింహ స్వామి ఆలయం..7వ మైల్కి మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. 75 రోజుల వ్యవధిలో 5 చిరుతలను అటవీ అధికారులు బంధించారు. అలిపిరి నడక దారిలో ఈ ఏడాది జూన్ 22, ఈనెల 11వ తేదీ చిన్నారులు కౌశిక్, లక్షితలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన బోనుల్లో ఇప్పటి వరకూ ఐదు చిరుతలు పట్టుబడ్డాయి. అయితే తాజాగా పట్టుబడిన చిరుత సంఖ్య రీత్యా ఎన్నోది అనే ప్రశ్న తలెత్తుతోంది. తొలుత పట్టుబడిన చిరుతను అటవీ అధికారులు అత్యంత సమీపంలోనే విడిచిపెట్టేయగా రెండవసారి, మూడవసారి పట్టుబడ్డ చిరుతలను జూపార్కులో ఉంచారు. నాలుగవ చిరుత విషయం తెలియలేదు. గతంలో పట్టుబడిన నాలుగు చిరుతలూ మగవేనని అధికారులు చెబుతున్నారు. మొదటి మూడు పులులూ రెండు నుంచీ మూడేళ్ళ లోపు వయసు కలిగి వున్నాయని, నాలుగోది మాత్రం ఐదారేళ్ళ వయసు కలిగి వుందని చెబుతున్నారు. ఇక ఇప్పుడు పట్టుబడిన పులికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa