ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్ట్ లో విచారణకి వచ్చిన నారాయణ కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 05:35 PM

రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కోనుగోలు ఆరోపణలతో మాజీ మంత్రి నారాయణ, మరికొందరిపై 2020లో సీఐడీ నమోదు చేసిన కేసు బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎస్‌.ప్రణతి స్పందిస్తూ... వ్యక్తిగత కారణాలతో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విచారణకు హాజరు కాలేకపోయారన్నారు. విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు. సీఐడీ తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషనర్‌ అభ్యర్థనను వ్యతిరేకించారు. సీనియర్‌ న్యాయవాది హాజరౌతారనే పేరుతో పిటిషనర్‌ పదేపదే వాయిదాలు తీసుకుంటున్నారన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ... పదేపదే వాయిదాలు కోరడం, విచారణను వాయిదా వేయడం కోర్టుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఒకే అంశంలో ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఏడాదిపాటు వ్యాజ్యాలపై విచారణ జరగపోవడం ఏమిటని ప్రశ్నించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.... ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లు వేయడంపై కోర్టును సంతృప్తిపరుస్తామన్నారు. ఇరువైపుల న్యాయవాదులూ వాయిదాలు కోరడంతోనే వ్యాజ్యాలపై విచారణ జరగలేదన్నారు. తదుపరి విచారణలో వాదనలు వినిపిస్తామన్నారు. చివరి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ కే సురేశ్‌రెడ్డి విచారణను సెప్టెంబరు 14కి వాయిదా వేశారు. తదుపరి విచారణలో వాదనలు వినిపించాలని తేల్చిచెప్పారు. పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa