ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాడిదలను వధిస్తే ఊరుకోము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 01:37 PM

రాష్ట్రంలో గాడిదలను వధించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, పశు సంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రవాణా శాఖ కమిషనర్‌, భారత జంతు సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. గాడిదలను వధించడంలో చట్ట నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, జంతుహింస నిరోధక చట్టం అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ డాక్టర్‌ కె.శశికళ మరొకరు హైకోర్టులో పిల్‌ వేశారు. రక్షణ బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి గాడిదలు దిగుమతి కాకుండా అడ్డుకొనే ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం మేరకు గాడిద మాంసం ‘యానిమల్‌ ఫుడ్‌ నిర్వచనం’ పరిధిలోకి రాదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa