ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెట్ల నరికివేతపై కోర్ట్ లో విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 02:20 PM

 మౌలిక వసతుల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చెట్లను నరికివేయకుండా వేరేచోటకు తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. చెట్లను నరికివేసి, ప్రత్యామ్నాయంగా వేరే చోట మొక్కలు నాటడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చలేమని సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేసింది. రహదారుల విస్తరణ, విద్యుత్‌ టవర్లు ఏర్పాటుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి, వేరేచోటకు తరలించేందుకు ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. విచారణను సెప్టెంబరు 20కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. జాతీయ రహదారులు విస్తరణ, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు సందర్భంగా అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఇష్టారీతిన చెట్లు నరికివేయకుండా, సాంకేతికత పరిజ్ఞాన్ని ఉపయోగించి వాటిని వేరేచోటకు తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్‌ మహ్మద్‌ షేక్‌ షా హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది బషీర్‌ అహ్మద్‌ వాదనలు వినిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa