మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాక్చావో ఇఖాయ్లో వేలాది మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు. టోర్బంగ్లోని వారి నిర్జన గృహాలకు చేరుకునే ప్రయత్నంలో ఆర్మీ బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa