ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ లో లుకలుకలు, బయటపడుతున్న అసమ్మతివర్గాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 02:18 PM

అనంతపురం జిల్లా, మడకశిరలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామికి టిక్కెట్‌ ఇస్తే పనిచేయమని అసమ్మతి వర్గ నాయకులు తేల్చిచెప్పారు. కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని తమ అభిప్రాయాలను గురువారం వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడు అశోక్‌బాబు వద్ద వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ అసమ్మతి నేతలు మడకశిరకు వచ్చిన అశోక్‌బాబుతో సమావేశమయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యేపై వారు అశోక్‌బాబు దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లినట్లు సమాచారం. కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేలా అదిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి హెచబీ నర్సేగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి వైఎన రవిశేఖర్‌ రెడ్డి, జి రంగేగౌడ్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa